లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఉత్తర్ప్రదేశ్లో 11 స్థానాలకు, గుజరాత్లో 4 స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. తొలి జాబితాలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ పేరు లేక పోవటం విశేషం.
అభ్యర్ధుల పేర్లు
1. రాయ్ బరేలీ- సోనియా గాంధీ(ఉత్తర్ప్రదేశ్)
2. షరాన్పూర్-ఇమ్రాన్ మసూద్(ఉత్తర్ప్రదేశ్)
3. ఖుషీ నగర్ -ఆర్.పి.ఎన్.సింగ్(ఉత్తర్ప్రదేశ్)
4. బదౌన్-సలీం ఇక్బాల్ షెర్వానీ (ఉత్తర్ప్రదేశ్)
5. అమేథీ-రాహుల్ గాంధీ(ఉత్తర్ప్రదేశ్)
6. ఫైజాబాద్-నిర్మల్ ఖత్రీ(ఉత్తర్ప్రదేశ్)
7. దౌరాహరా-జితిన్ ప్రసాద్(ఉత్తర్ప్రదేశ్)
8. జలావున్(ఎస్సీ)-బ్రిజ్లాల్ ఖబ్రీ(ఉత్తర్ప్రదేశ్)
9. అక్బర్పూర్-రాజారాం పాల్(ఉత్తర్ప్రదేశ్)
10. ఉన్నావ్-అన్ను టాండన్(ఉత్తర్ప్రదేశ్)
11. ఫరూకాబాద్-సల్మాన్ ఖుర్షీద్(ఉత్తర్ప్రదేశ్)
12. ఛోటా ఉదయ్పూర్(ఎస్టీ)-రంజిత్ మోహన్సిన్హ్ రత్వా(గుజరాత్)
13. అహ్మదాబాద్ వెస్ట్-ఎస్సీ-రాజు పర్మర్(గుజరాత్)
14. వడోదర- ప్రశాంత్ పటేల్(గుజరాత్)
15. అనంద్-భరత్సిన్హ్.ఎం. సోలంకీ(గుజరాత్)