ఈ మధ్య జరిగిన ఆసీస్ టూర్లో బేబీ సిట్టర్ అనే పేరుతో రిషబ్ మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.. ముందు వివాదంగా మొదలై ఆ తరువాత ఆసీస్ కేప్టిన్ టిమ్ పైన్ .. “పంత్ నా పిల్లలను ఆడించు నేను నా భార్యతో సినిమాకి వెళ్తాను” అని చమత్కరించడంతో, సరదాగా తీసుకున్న పంత్ పైన్ ఇంటికి వెళ్లి వాళ్ళ పిల్లలతో సరదాగా గడిపాడు. ఈ విషయాన్ని పైన్ భార్య బోనీ పైన్ కూడా తెలియచేసింది. ఆసీస్ పర్యటనలో భాగంగా పంత్ బేబీ సిట్టర్ పేరుతో హాట్ టాపిక్గా మారాడు. దీనిపై ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్ యాడ్ తీసేసింది. ఈ నెల చివర్లో భారత పర్యటనకు ఆసీస్ రానున్న సమయంలో స్టార్ స్పోర్ట్స్ ఈ యాడ్ను చిత్రీకరించింది .
అయితే ఈ యాడ్లో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ బేబీసిట్టర్గా మారాడు. ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్ యూట్యూబ్లో, సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. దీంతో ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. తాజాగా దీనిపై ఆసీస్ దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్ తిరిగి కౌంటర్ ఇచ్చాడు. ఈ వీడియోలో ఆసీస్ జట్టు జెర్సీలతో యాడ్ను రోపొందించడంఫై అసహనం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఆసీస్ను అంతా తేలిగ్గా తీసుకోవద్దు వీరూ అంటూ ధీటుగా సమాధానమిచ్చాడు. వరల్డ్కప్ వంటి మెగాటోర్నీలో ఎవరు బేబీ సిట్టర్స్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నాడు. ఆసీస్ ఏమీ పసికూన కాదనే సంగతిని తెలుసుకోవాలన్నాడు.ఈ విషయమై హేడెన్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా యాడ్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్ను, యాడ్ రూపొందించిన స్టార్ స్పోర్ట్స్లను ట్యాగ్ చేస్తూ విమర్శలు గుప్పించాడు.