నేనూ దానికే.. వెయిటింగ్‌

`యన్‌టీఆర్‌ గారి కథానాయకుడు’ కోసమే మేము వెయిట్‌ చేస్తున్నామని, ఆ సినిమా త్వరగా చూడాలని చాలా ఆతృతగా ఉందని హీరో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తెలిపారు. ఆయన్ని దగ్గరగా చూడలేకపోయినా.. ఇప్పటికీ స్ర్కీన్‌పై చూడటం చాలా ఆనందంగా ఉందన్నాడు. ఎన్టీఆర్‌పై ఎంతో గౌరవంతో ఆ చిత్రాన్ని తెరకెక్కించారని చెప్పాడు. ప్రతి ఒక్కరూ సినిమా కోసం ఎదురుచూసేలా బయోపిక్‌ను డైరెక్టర్‌ క్రిష్ అద్భుతంగా తెరకెక్కించారని అభినందించాడు.

కాగా.. ఈ పొంగల్‌ చాలా హాట్‌హాట్‌గా ఉండబోతుందని తెలిపారు. `ఎఫ్‌2′ గురించి కూడా మాట్లాడుతూ.. ఈ సినిమా కూడా సూపర్‌హిట్‌ అవుతుందని అన్నారు. వెంకటేష్‌ గారు, వరుణ్‌ల సినిమా బాగా ఎంటర్‌టైన్‌ చేస్తుందని.. వెంకటేష్‌ గారి కామెడీని నేను బాగా ఎంజాయ్‌ చేస్తానని.. ఆయన పక్క వరుణ్‌ ఎలా యాక్ట్‌ చేశాడో చూడాలి అని అన్నాడు చెర్రీ. ఈ సంక్రాంతి పోటీ గురించి తాను ఆందోళన చెందడం లేదని.. అన్ని సినిమాలు హిట్ అవుతాయనే విశ్వాసం తనకు ఉందని చెప్పాడు. ప్రజలు అందరినీ ఆదరిస్తారని అన్నారు.

కాగా.. చెర్రీ నటించిన ‘వినయ విధేయ రామ’ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్‌లో చరణ్ బిజీగా ఉన్నాడు. మరోవైపు, ఈ సంక్రాంతికి బరిలో మరో నాలుగు భారీ చిత్రాలు ఉండటం ఆసక్తిని రేపుతోంది. 9న బాలయ్య నటించిన ‘కథానాయకుడు’, 10న రజనీకాంత్ చిత్రం ‘పేట’, 11న ‘వినయ విధేయ రామ’, 12న వెంకటేష్, వరుణ్‌తేజ్‌ నటించిన ‘ఎఫ్2’ లు విడుదల కానున్నాయి. సో.. ఈ సారి పొంగల్‌కు బాక్సాఫీప్ వద్ద తీవ్ర పోటీ నెలకుంటుందని అర్థమవుతుంది.

leave a reply