తేనె,ఖర్జూరంలో… ఆరోగ్యప్రయోజనాలు!

ఎండు ఖర్జూరాలను తేనెలో నానబెట్టి తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇందుకోసం తేనె, ఒక వంతు గింజ తీసిన ఎండు ఖర్జూరాలను ఉంచి, వీటిని బాగా కలిపి మూతపెట్టి కొన్ని రోజులు ఉంచాలి. ఇలా ఉంచిన ఒక వారం తర్వాత రోజుకు ఒకట్రెండు చొప్పున ఈ ఖర్జూరాలను తినొచ్చు. తేనెలో నానబెట్టిన ఖర్జూరాలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.

ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల  దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తి పెరిగి జబ్బుల బారిన పడకుండా చేస్తుంది. నిద్రలేమితో బాధపడే వారు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల హాయిగా నిద్రపోవచ్చు. ఒత్తిడి తగ్గుతుంది. ఈ మిశ్రమంలోని యాంటీ బయాటిక్ గుణాల వల్ల గాయాలు త్వరగా మానతాయి. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. చిన్నారులు చదువుల్లో చురుగ్గా ఉంటారు.

తేనె, ఖర్జూర మిశ్రమంలో కాల్షియం, ఐరన్‌ పుష్కలంగా లభించడంతో రక్త హీనత తగ్గి, ఎముకలు బలంగా తయారవుతాయి. మలబద్ధకంతో బాధపడే వారు వారంలో మూడు రోజులు ఖర్జూరాలను తింటే ఫలితం కనపడుతుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా పరుగుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం అవుతాయి. కడుపులో క్రిములు ఉంటే చనిపోయి రక్త సరఫరా మెరుగు పడుతుంది.

leave a reply