నిమ్స్ వైద్యుల… నిర్లక్ష్యం!

హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో దారుణం జరిగింది. తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకత గావించిన నిమ్స్ లోని  వైద్యులు ఓ రోగి ప్రాణంతో చెలగాటం ఆడారు. మహేశ్వరికి అనే మహిళకు నిమ్స్ వైద్యులు ఆపరేషన్ చేసిన వైద్యులు ఆపై కత్తెరని కడుపులోనే వదిలేసి కుట్లు వేశారు. అయితే ఈ సంఘటన మూడు నెలల క్రితం జరగగా… ఆపరేషన్ తర్వాత నొప్పి తగ్గకుండా వస్తుండటంతో ఆందోళన చెందిన మహేశ్వరి తిరిగి ఆస్పత్రికి చేరుకుని విషయాన్ని వైద్యులకు తెలియజేసింది.

ఎంతకీ నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు ఎక్స్‌రే తీసి చూశారు. దాంతో మహిళ కడుపులో కత్తెర ఉందని గుర్తించారు.ఈ విషయాన్ని రోగి బంధువులకు చెప్పగా… ఈ సంఘటనతో రోగి బంధువులు వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నిమ్స్ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

leave a reply