పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో దేశం యావత్తు పాకిస్తాన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పాకిస్థాన్పై మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని, పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని సోషల్ మీడియా ద్వారా నెటిజన్లందరూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్లోనే ఉంటూ పాకిస్థాన్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కూడా ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోంది. తాజాగా.. ఈ వ్యాఖ్యలపై యాంకర్ రష్మీ స్పందిస్తూ.. ‘పాకిస్థాన్కి అనుకూలంగా మాట్లాడుతోన్న సిద్ధూ.. దేశ విభజన సమయంలో అక్కడికే వెళ్లిపోవలసింది. దురదృష్టవశాత్తు ఆయన ఇప్పటికీ ఇక్కడే ఉండిపోయారు’ అంటూ అసహనాన్ని ప్రదర్శించింది. ఇక ‘పాకిస్థాన్ ఆర్మీ జిందాబాద్’ అంటూ షోయెబ్ హఫీజ్ అనే నెటిజన్ ట్వీట్కి రష్మీ స్పందిస్తూ..’సాలే .. ఏంట్రా నీ పాకిస్థాన్ గొప్పతనం?.. మాతోనే నీ అస్తిత్వం.. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి సిగ్గులేదా? మూస్కోని కూర్చో.. లేదంటే పాకిస్థాన్కి వెళ్లిపో’ అంటూ మండిపడింది.
‘సాలే .. ఏంట్రా నీ పాకిస్థాన్ గొప్పతనం?
Post navigation
Posted in: