శ్రీపురం స్వర్ణ దేవాలయం

భారతదేశంలో  ప్రఖ్యాత పొందిన ఆలయాల్లో ఒకటి శ్రీపురం మహాలక్ష్మీ స్వర్ణ దేవాలయం. ఈ దేవాలయములో గర్భగుడికి మూడు వైపులా నీరు , ఒకవైపు ద్వారం వుంటుంది. ఆ నీటిని పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ ఆలయంలో మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తూంటారు.

శ్రీపురం స్వర్ణదేవాలయం ఇటీవలే నిర్మించిన స్వర్ణ దేవాలయం. తమిళనాడు రాష్ట్రంలోని వేలూరుకు దగ్గర్లో మలైకుడి అనే ప్రాంతానికి దగ్గర్లో కొండల దిగువున దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడినది. చెన్నై నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని నిర్మాణానికి ‘నారాయణి అమ్మ’ అనే స్వామి నేతృత్వం వహించాడు. ఆయన్ని శక్తి సిద్ధ అనే పేరుతో కూడా పిలుస్తారు. దీని గర్భగుడి సుమారు 1.5 మెట్రిక్ టన్నుల అసలుసిసలైన బంగారంతో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉండటం చేతనే దీనికి బంగారు గుడి అని పేరు వచ్చింది.

గుడిలోకి ప్రవేశించే దారి పొడవునా భగవద్గీత, ఖురాన్, బైబిల్, గురుగ్రంథ్ సాహిబ్ నుంచి సేకరించిన శ్లోకాలు పొందుపరచబడి ఉంటాయి. ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చే భక్తుల దర్శనాన్ని పర్యవేక్షించడానికి సుమారు 700 మంది పోలీసులను ప్రభుత్వం నియమించింది. ఇక్కడ ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు చెయ్యరు. శ్రీ విద్య అనే ప్రాచీనమైన మరియు అరుదైన శక్తి పూజా విధానాన్ని అనుసరిస్తారు.

leave a reply