తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.
ముందుగా శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ను శ్రీవారి ఆలయం నుండి శ్రీ భూవరాహస్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు.
శ్రీవారి పుష్కరిణిలో ఉదయం 4.30 నుండి 5.30 గంటల నడుమ స్నపన తిరుమంజనం, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవం వైభవంగా చేపట్టారు.
శ్రీస్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన స్నానమాచరించిన వారికి తిరుమల శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందని పురాణాల ప్రాశస్త్యం.
ద్వాదశి పర్వదినం కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్, తిరుమల జేఈవో కే.ఎస్.శ్రీనివాసరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ రుద్రరాజు పద్మరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.