అమ్మాయిల కిడ్నాప్…మరుసటి రోజే ఇంటికి!

అమ్మాయిల కిడ్నాప్ కేసులు కలకలం రేపుతున్నాయ. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేలోపే కిడ్నాప్ అయినా పిల్లలు ఇంటికి రావడం గమనార్హం. న్యూఢిల్లీలో వరుసగా అమ్మాయిల కిడ్నాప్ కేసులు పోలీసుల ముందుకు వస్తున్నాయి. అయితే కిడ్నాప్ అయినా వాళ్ళందరూ 8 నుంచి 12 ఏళ్లలోపు వయసున్న అమ్మాయిలే అవడం విశేషం. అయితే, కేసును విచారించే లోపే, మరుసటి రోజు తమ బిడ్డ ఇంటికి వచ్చిందని తల్లిదండ్రులు చెబుతున్నారు.  ఇదే రీతిలో చాలా కేసులు రావడంతో, ఈ కేసులపై ప్రత్యేక శ్రద్ద తీసుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, ఇలాంటి కిడ్నాప్ లకు పాల్పడుతున్నది  ఒకే వ్యక్తని నిర్ధారణ చేసారు.  ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించగా అమ్మాయిల కిడ్నాప్ వెనకున్న అసలు కారణం తెలుసుకొని ఆశర్యపడ్డారు.

అతను తెలిపిన వివరాల ప్రకారం… కృష్ణా తివారి అనే వ్యక్తి  ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్స్ లో నివాసం ఉండగా.. అతనికి భార్య, ఇద్దరు కుమారులతో ఉంటున్నాడు. అయితే అతనికి అమ్మాయిలంటే  చాలా ఇష్టం. తనకు ఆడ పిల్లలు లేకపోవడంతో, రోడ్డుపై కనిపించిన ఆడపిల్లలని తన ఇంటికి తీసుకెళ్లడమే కాక వాళ్లకు కావలిసినవన్ని  కొనిచ్చి మరుసటి రోజు జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి చేర్చేవాడు. అయితే కుమార్తెలు లేరన్న ఒక్క భావనతోనే ఇలా ఆడపిల్లలను తీసుకువచ్చి ముచ్చట తీర్చుకుంటున్నానని తివారీ పోలీసులకు వివరించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నారు.

leave a reply