రోడ్డు ప్రమాదంలో…12 మంది మృత్యువాత!

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఉజ్జయిని జిల్లా రామ్‌గఢ్‌ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించి.. రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో 12 మంది అక్కడిక్కకడే దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. క్షతగాత్రులను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా వీరి వ్యాన్‌ రోడ్డుపై ఉన్న మరో వ్యాన్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ దుర్ఘటన సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనఫై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

leave a reply