ఆస్ట్రేలియాతో రేపటి నుంచి సిడ్నీలో నాలుగో టెస్ట్ జరగనున్న నేపథ్యంలో 13 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొదటి టెస్టులో అనారోగ్యంతో జట్టుకు దూరమైన అశ్విన్కు నాలుగవ టెస్ట్ లో అవకాశం లభించింది. అయితే బీసీసీఐ ప్రకటించిన జట్టులో అశ్విన్ ఆడతాడా లేదా అనేది మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్ణయిస్తామని బీసీసీఐ తెలిపింది. అయితే రోహిత్ శర్మ ఇంట కూతురు పుట్టడంతో స్వదేశానికి వెళ్ళిపోయాడు. చివరిదైన సిడ్నీ టెస్టులో పైచేయి సాధించి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తోంది.
బీసీసీఐ ప్రకటించిన తుది జట్టు సభ్యుల వివరాలు: విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే(వైస్ కెప్టెన్), ఛతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవీంద్రన్ అశ్విన్, మహ్మద్ షమి, జస్ప్రిత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్.