అసెంబ్లీ స్థానాల పెంపు ఇప్పట్లో.. సాధ్యం కాదు..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 170(3)వ అధికరణం ప్రకారం 2026 తర్వాత సేకరించే తొలి జనాభా లెక్కల ప్రకారమే అసెంబ్లీ సీట్ల పెంపు ఉంటుందని కేంద్రం పేర్కొంది. రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీ స్థానాలు పెంచాలని విభజన చట్టంలో తెలుగు రాష్ట్రాలు పేర్కొన్నాయి. ఏపీలో 175 నుంచి 225కు, తెలంగాణాలో 119 నుంచి 153కు పెంచాలని పొందుపరిచారు. మరోవైపు విభజన చట్టంలోని 12వ షెడ్యూల్‌ అంశాలన్నీ దాదాపు అమలులోకి తెచ్చామని కేంద్రం స్పష్టం చేసింది.

leave a reply