కేంద్రం తీరుపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్లో పెట్టుబడి పెట్టిన కేంద్రం, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ కోసం గ్రాంటు ఇవ్వలేదని, ఏపీలో గ్రీన్ ఫీల్డ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలన్న హామీని కేంద్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఏపీలోని `75 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను స్థాపిస్థామని, ఇందుకోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎవర్టన్, పతంజలి, జైన్ ఇరిగేషన్, పార్లే, జెర్సీ, ఇండస్ కాఫీ తదితర పరిశ్రమలు వచ్చాయని గుర్తుచేశారు. కేంద్రంకే సిగ్గు రావాలనే కడప స్టీల్ ప్లాంట్ను నష్టాల్లో ఉన్నా టీడీపీనే నిర్మాణం చేపడుతుంది అని అన్నారు.