గురువారం టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి నక్కా ఆనందబాబు కేసీఆర్కు ధైర్యం ఉంటే.. ఏపీ రాజకీయాల్లోకి డైరెక్ట్గా రావాలని సవాల్ విసిరారు. ఆంధ్రలోకి వస్తామని మాటలు చెప్పడం కాకుండా.. ధైర్యంగా రావాలని అన్నారు. వైకాపా, జనసేనలతో తెలంగాణలో చేసిన తెరచాటు రాజకీయాలు కాకుండా బహిరంగంగా కలిసి రావాలనిఅన్నారు.
టీఆర్ఎస్ కారుకు..బీజేపీ, వైకాపా, జనసేన, ఎంఐఎం అనేవి నాలుగు చక్రాలుగా మారాయన్నారు. వైఎస్ జగన్కు ఎప్పుడూ రాష్ట్రప్రయోజనాలు అక్కర్లేదని, అందుకే రాష్ట్ర వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతారని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే ఇక్కడ జనసేన, వైకాపా సంబరాలు చేసుకోవడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు మంత్రి ఆనందబాబు.