ఐసీసీ ర్యాంకింగ్స్‌…కోహ్లీ, బుమ్రా

Indian cricket captain Virat Kohli congratulate Jasprit Bumrah during the 3rd One Day International cricket match between Sri Lanka and India at the Pallekele international cricket stadium at Kandy, Sri Lanka on Sunday 27 August 2017. (Photo by Tharaka Basnayaka/NurPhoto via Getty Images)

తాజాగా ఐసీసీ వెలువరించిన వన్డే ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా తమ విభాగాల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. అయితే జట్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో 126 రేటింగ్‌ పాయింట్లతో ఇంగ్లాండ్‌ నిలిచింది. తరువాత జరగబోయే ఆసీస్ మరియు న్యూజిలాండ్ వన్డే సిరీస్ లలో వరుసగా మ్యాచ్‌లు గెలిస్తే 125 పాయింట్లతో ఇంగ్లాండ్‌కు చేరువలో ఉంటుంది.

టీంఇండియా బ్యాటింగ్‌ విభాగంలో మొదటి స్థానంలో కోహ్లీ,రెండో స్థానంలో రోహిత్‌ శర్మ తొమ్మిదో స్థానంలో శిఖర్ ధావన్ ఉన్నారు. బౌలింగ్‌ విభాగంలో జస్ప్రీత్‌ బుమ్రా అగ్రస్థానంలో కొనసాగగా కుల్‌దీప్‌ యాదవ్‌ మూడో స్థానంలో చాహల్ ఆరో స్థానంలో నిలిచారు. అటు శ్రీలంకపై 3-0తో విజయం సాధించిన న్యూజిలాండ్‌ ఆటగాళ్ల ర్యాంకులు కూడా మారాయి. పరుగుల వరద పారిస్తున్న రాస్‌ టేలర్‌ మూడో స్థానంలో, కేన్‌ విలియమ్సన్‌ 11వ ర్యాంకుకు చేరుకున్నాడు. న్యూజిలాండ్ అల్ రౌండర్ ఇష్ సోధి 26 స్థానాలు ఫెర్గ్యూసన్ 12 స్థానాలు ఎగబాకి సంయుక్తంగా 31వ స్థానంలో చేరారు.

leave a reply