న్యూయర్ ఫస్ట్ డే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. కాగా.. సోమవారం నష్టాలతో ముగిసినా.. ఈరోజు ట్రేడింగ్ ఆరంభంలో తడబాటుకు గురైనా.. చివరి సెషన్లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో లాభాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్ 186 పాయింట్లు లాభపడి 36,254కు పెరిగింది. నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో 10,910 వద్ద స్థిరపడింది.