హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్ ప్రభుత్వ ఆక్రమిత స్థలంలో ఉందంటూ శేరిలింగంపల్లికి చెందిన రెవెన్యూ అధికారులు సీజ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే తన గెస్ట్ హౌస్ సీజ్ చేయడంపై సినీ నటుడు ప్రభాస్ స్పందించి, తనకు నోటీసులివ్వకుండానే గెస్ట్హౌస్ను అధికారులు సీజ్ చేశారని ఆరోపించారు.
కాగా.. హైదరాబాద్ శివారు ప్రాంతం రాయదుర్గం సమీపంలో గల ప్రభుత్వ ఆక్రమిత భూముల్లోని నిర్మాణాలను రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు. ఆ ప్రాంతంలో ఉన్న సినీహీరో ప్రభాస్ గెస్ట్హౌస్ను సీజ్ చేశారు. ప్రభాస్ గెస్ట్ హౌస్ వద్ద ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గేటుకు నోటీసు అంటించి సీజ్ చేశారు.ఈ విషయమై ప్రభాస్ దాఖలు చేసిన పిటిషన్పై నేడు విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.