క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు ఇక పనిచేయవు..!

ఏంటి..? షాక్‌అయ్యారా..! అవునండి.. డిసెంబర్‌ 31 తర్వాత నుంచి మీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు పనిచేయవు. అవునా.. ఎందుకు? అనుకుంటున్నారా.. క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను అప్‌గ్రేడ్‌ చేసుకోండి అంటూ మీ ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నాయా.. వాటిని మీరు పట్టించుకోవడంలేదా..? సో.. వెంటనే మీ బ్యాంక్‌కు వెళ్లండి.. కార్డులు బ్లాక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అని అడగండి.. చెప్తారు

ఈ మధ్య మోసాపూరిత లావాదేవీలు చాలా జరుగుతున్నాయి.. కదా.. మీకు తెలియకుండానే డబ్బులు కూడా మాయమవుతున్నాయి.. కూడా.. సో.. ఇక అలా జరగకుండా ఉండాలంటే వెంటనే మీ బ్యాంక్‌కు వెళ్లి క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను ఛేంజ్‌ చేసుకోండి. కస్టమర్స్‌ను రక్షించేందుకు రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. మ్యాగ్‌స్ట్రైప్‌డెబిట్‌ కార్డులు ఉన్న ఖాతాదారులు వాటి స్థానంలో ఈఎంవీ చిప్‌ డెబిట్‌ కార్డులుతీసుకోవాలని ఆర్‌బీఐ సూచించింది. ఆయా బ్యాంకులు ఈ సేవలను పూర్తిగా అందించాలని,ఈ ఏడాది చివరి లోగా ప్రతిఒక్కరూ చిప్‌ ఆధారిత కార్డులు తీసుకోవాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

ఈ ఏడాది డిసెంబరు31లోగా మ్యాగ్‌స్ట్రైప్‌డెబిట్‌ కార్డుల స్థానంలో చిప్‌ ఆధారిత కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని లేదంటే ఆకార్డులను శాశ్వతంగా నిలిపివేస్తామని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ లేదా బ్యాంక్‌ బ్రాంచ్‌కు వెళ్లి ఈ కార్డులను మార్చుకునే సౌలభ్యం కూడాఉంది.

మరి ఇంకెందుకు ఆలస్యం.. బ్యాంకులకు క్యూ కట్టండి.

మరి మీ కార్డులు చిప్‌ ఆధారిత కార్డులా కాదా అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలంటే.. మీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డు ముందువైపు బంగారు రంగులో చిన్న చిప్‌ ఉంటుంది. అది ఉంటే మీది ఈఎంవీ కార్డే. లేదంటే మార్చుకోవాల్సి ఉంటుంది.

leave a reply