హైదరాబాద్లో మలక్పేటలోని ఓ ఇంట్లో దారుణం చోటుచేసుకుంది. సొంత అక్కనే ఆస్తి కోసం కిరాతకంగా హత్య చేసిన ఘటన మలక్పేటలోని ప్రశాంత్నగర్లో వెలుగు చూసింది. హంతకుడు సిద్దార్థ్ వనపర్తిలోని నీటిపారుదలశాఖలో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. తన సోదరి శివనందినితో కొంతకాలంగా సిద్ధార్థ్కు ఆస్తి తగాదాలు ఉన్నాయి. శివనందిని కొన్ని గొడవల కారణంగా ఆమె భర్తతో విడాకులు తీసుకుని తమ్ముడు సిద్ధార్థ్ వద్దనే ఉంటోంది. దీంతో.. ఆమె ఆస్తిపై కన్నేసిన సిద్ధార్థ.. పథకం ప్రకారం మూడు రోజుల క్రితమే ఆమెను హత్య చేసి మృతదేహాన్ని బాత్రూంలో దాచిపెట్టాడు. అనంతరం తన సోదరి కన్పించడం లేదంటూ కుటుంబ సభ్యులతో వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా.. ఇంట్లోంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన పోలీసులు సిద్ధార్థ్ను అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం బయటపడింది. తమదైన స్టైల్లో పోలీసులు విచారించగా ఆస్తి కోసమే తన సోదరిని చంపినట్టు నిందితుడు అంగీకరించాడని, అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.