అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతుండడంతో ఈ రోజు దేశీయంగా కూడా చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. చమురు ధరలు ఈ ఏడాది కనిష్ఠానికి పడ్డాయి శనివారం పెట్రోల్, డీజిల్ ధరలు 29 పైసల చొప్పున తగ్గడంతో ఈ సంవత్సరంలో రాజధాని దిల్లీ నగరంలో ఈరోజు లీటరు పెట్రోల్ ధర 29 పైసలు తగ్గి రూ.69.26పైసలకు చేరింది. కాగా నిన్న దిల్లీలో పెట్రోల్ ధర రూ.69.55గా ఉండగా. నేడు దిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.63.32గా ఉంది. .
దేశంలోని పలు మెట్రో నగరాలైన కోల్కతా, ముంబయి, చెన్నై నగరాల్లో కూడా పెట్రోల్ ధరలు ఈ ఏడాది కనిష్ఠానికి చేసుకున్నాయి. వరుసగా ఈ నగరాల్లో ఈరోజు లీటరు పెట్రోల్ ధర రూ.71.37, రూ.74.89, రూ.71.85కు చేరుకున్నాయి. లీటరు డీజిల్ ధర నేడు కోల్కతాలో రూ.65.07గా, ముంబయిలో రూ.66.25గా, చెన్నైలో రూ.66.84గా ఉన్నాయి. నిన్న ఈ నగరాల్లో వరుసగా డీజిల్ ధరలు రూ.65.37, రూ.66.57, రూ.67.16గా ఉన్నాయి.