టీ20,వన్డే సిరీస్ కు.. భారత జట్టు!

న్యూజిలాండ్ తో జరగబోయే టీ20,వన్డే సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే వెస్టిండీస్, ఆస్ట్రిలియా సిరీస్ కు దూరమైన టీంఇండియా మాజీ సారధి మహేంద్రసింగ్ ధోనిని సెలెక్టర్లు ఎంపిక చేసారు. ధోని రాకతో జట్టుకు మరింత బలం చేకూరనుంది. అటు ఆస్ట్రిలియాతో వన్డే సిరీస్ కు దూరమైన పంత్ స్థానంలో హార్దిక్ పాండ్య ఎంపిక అయ్యాడు. కాగా .. వన్డే సిరీస్ కు ఎంపికైన జట్టు వివరాలు.. కోహ్లీ (కెప్టెన్ ),రోహిత్ శర్మ ,రాహుల్,శిఖర్ ధావన్, రాయుడు ,దినేష్ కార్తీక్ ,కేదార్ జాదవ్ ,ధోని,హార్దిక్ పాండ్య , చాహల్ , కుల్దీప్ యాదవ్ ,రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్ , జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్ ,మహ్మద్ షమి .

న్యూజిలాండ్ టీ20 సిరీస్ : కోహ్లీ (కెప్టెన్ ),రోహిత్ శర్మ ,రాహుల్,శిఖర్ ధావన్ ,రిషబ్ పంత్ ,దినేష్ కార్తీక్ ,కేదార్ జాదవ్ ,ధోని,హార్దిక్ పాండ్య ,క్రునల్ పాండ్య , కుల్దీప్ యాదవ్,చాహల్ ,భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్.

leave a reply