నువ్వా మా జట్టు గురించి మాట్లాడేది?

న్యూజిలాండ్‌తో నాల్గో వన్డేలో  స్వల్ప స్కోరుకే పరిమితమై ఓటమి పాలైన టీమిండియాఫై  ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ కించపరుస్తూ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం మిస్‌ ఫైర్‌ అయ్యింది. ఈ మ్యాచ్ లో భారత్‌ 92 పరుగులకు ఆలౌట్‌ అవడంతో దీని గురించి ట్వీట్ చేస్తూ… ఈ రోజుల్లో వంద పరుగులకే  ఆలౌటయ్యే జట్టు ఉందంటే తనకు నమ్మశక్యంగా లేదంటూ వాన్‌ ట్వీట్‌ చేశాడు. దీనిపై భారత అభిమానులు ధీటుగా సమాధానం ఇచ్చారు.

మంచి ఫామ్ కనబరుస్తున్న భారత జట్టును కించపరిచే ముందు నీ జట్టు ఏ స్థితిలో ఉందొ చూసుకో, అంటూ ట్వీటర్‌ వేదికగా విమర్శలు చేస్తున్నారు. ఇందుకొరకు  ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 77 పరుగులకు ఆలౌట్‌ కావడాన్ని అతనికి పంపి భారత క్రికెట్‌ ఫ్యాన్స్‌ వాన్‌ను ఏకిపారేస్తున్నారు. “92 పరుగులు ఎక్కువా.. 77 పరుగులు ఎక్కువా” అని వాన్‌కు సైటైర్లు పంపిస్తున్నారు. మా జట్టులో కొంతమంది ముఖ్యమైన ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగి 92 పరుగులకు ఆలౌటయ్యాం.. మరి మీ జట్టు పూర్తిస్థాయి ఆటగాళ్లతో దిగి ఎనిమిదో ర్యాంక్‌ వెస్టిండీస్‌పై 77 పరుగులు చేయడం మీకు నమ్మశక్యంగా ఉందా’ అని ఘాటుగా విమసించారు.  

leave a reply