నేను పక్కా లోకల్..!

నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటా: నందమూరి సుహాసిని

స్థానికతపై వస్తున్న విమర్శలను కూకట్‌పల్లి మహాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను హైదరాబాద్ బిడ్డనని, ‘నేను లోకలే… నేను ఇక్కడే ఉంటా. రాత్రింబవళ్లు ఇక్కడే ఉంటాననీ, అర్థరాత్రి తలుపు తడితే మీకు అండగా ఉంటానని సుహాసిని తెలిపారు తెలిపారు. శుక్రవారం కూకట్‌పల్లి టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ…. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన టీఆర్ఎస్ అవేమీ నెరవేర్చలేదని అన్నారు. తాను గెలిస్తే వాటన్నింటినీ నెరవేర్చుతానని తెలిపారు.

అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీపీఐ జాతీయ నేత నారాయణ మాట్లాడుతూ… ప్రతిపక్షాల ఒత్తిడి లేకపోయినా కేసీఆర్ ఎందుకు అసెంబ్లీని రద్దు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నందమూరి సుహాసిని కూకట్‌పల్లిలో పోటీ చేస్తే టీఆర్ఎస్‌కు అంత భయమెందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆమె గెలుపు ఖాయమని నారాయణ జోస్యం చెప్పారు. ఇక సుహాసినీ స్థానికతపై వస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. ప్రజాస్వామ దేశంలో ఏ వ్యక్తి అయినా…ఎక్కడి నుంచి అయినా ఎన్నికల్లో పోటీ చేయవచ్చన్నారు. ఇది తెలియని వాళ్లే విమర్శలు చేస్తున్నారని నారాయణ మండిపడ్డారు.

leave a reply