కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు జలవనరుల శాఖలో 5వేల రూపాయలు లంచం తీసుకుంటూ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న దాసరి మల్లిఖార్జున్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇదే శాఖలో సీనియర్ అసిస్టెంట్ వి.వి. గిరి తన సర్వీస్ విషయంలో లంచం డిమాండ్ చేయడంతో వి.వి. గిరి ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుపగా, మల్లిఖార్జున్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్హ్యండెడ్గా పట్టించాడు.