ఎట్టకేలకు మొక్కుబడి నెరవేరింది..

మొత్తానికి కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేయడంతో ఎంపీ సీఎం రమేశ్‌ తిరుమలలో మొక్కు చెల్లించుకున్నారు. ఆదివారం రాత్రి శ్రీవారి మెట్ల మార్గంలో కాలినడకన కొండపైకి చేరుకున్న ఆయన సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారిని దర్శించుకున్నారు. తన చిరకాల కోరిక నెరవేరడంతో తలనీలాలను సమర్పించానని ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

కేంద్రప్రభుత్వం చేయాల్సిన పనిని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంగతిని పార్లమెంటులో ప్రస్తావిస్తానని తెలిపారు. సొంత జిల్లాలో పరిశ్రమ నిర్మించేందుకు కృషి చేయాల్సిందిపోయి ప్రతిపక్ష నాయకుడు విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా కేంద్రం సిగ్గు తెచ్చుకుని నిందించింది చాలని.. ఇకనైనా ఏపీకి ఇవ్వాల్సిన హామీలు నెరవేర్చితే చాలనన్నారు. ఎవరెన్ని కామెంట్స్‌ చేసినా.. అడ్డంకులు సృష్టించినా ఈ పరిశ్రమ పూర్తిచేస్తామన్నారు.

leave a reply