సినీ నటి అమీ జాక్సన్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. బ్రిటన్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ పనాయొటోతో ఆమె కొంతకాలంగా డేటింగ్లో ఉన్నారు. అయితే అయితే న్యూఇయర్ రోజున వీరిద్దరూ జాంబియాలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా అమీ జాక్సన్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.” 2019 జనవరి 1 న మన జీవితంలో కొత్త ప్రయాణం మొదలవబోతుంది. ఐ లవ్యూ… నన్ను చాలా సంతోషంగా ఉంచుతున్నందుకు ధన్యవాదాలు” అని వివరిస్తూ ఒక ఫొటోను పోస్ట్ చేశారు…”ఐ ” రోబో “2.ఓ” వంటి పెద్ద చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. “2.ఓ” చిత్రంలో ఆమె సూపర్స్టార్ రజనీకాంత్కు జోడీగా రోబో పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. అంతేకాక తెలుగులో ‘ఎవడు’, ‘అభినేత్రి’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే పెళ్లి ఎప్పుడన్నా విషయాన్ని మాత్రం అమీ జాక్సన్ తెలియచేయలేదు.