పేలిన ఫ్రిజ్..యువతీ మృతి!

ఫ్రిజ్ పేలిన సంగటన ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది ఫ్రిజ్‌ సిలిండర్‌ పేలి గురువారం మృతి చెందిన దీపిక (18) మృతదేహాన్ని గుర్తించడం తొలుత కష్టంగా మారిందని అక్కడున్న స్థానికులు తెలిపారు. తీరా చూస్తే కాలిన గాయాలతో ఉన్న అమ్మాయని స్పష్టమైంది.గురువారం దీపిక కుటుంబసభ్యులు అందరూ ఒక ఫంక్షన్‌కు వెళ్లడంతో ఇంట్లో ఎవరు లేకపోడంతో ఈ సంఘటన చప్తుచేసుకుంది. పరీక్షలు ఉన్నందున ఇంట్లోనే చదువుకుంటున్న దీపిక. మధ్యాహ్న సమయంలో ఆ ఫ్రిజ్‌లో ఉన్న పులిహోర తినటానికి ఫ్రిజ్‌ను తెరవడంతో ఒక్కసరిగా పేలుడు సంబవించింది.

ముందు పొగలు ఆపై పెద్ద శబ్ధంతో ఫ్రిజ్‌ పేలింది. ఆ పేలుడు ధాటికి దీపిక బాగా కాలిపోయి ప్రాణాలు విడిచింది. ఫ్రిజ్‌ లోపలి భాగం పూర్తిగా కాలిపోవడం, పేలుడు ధాటికి తలుపు సైతం ఎగిరిపడడం, వంట గదిలో ముందు పొగలు ఆపై పెద్ద శబ్ధంతో ఫ్రిజ్‌ పేలింది. ఆ పేలుడు ధాటికి దీపిక కాలిపోయి ప్రాణాలు విడిచింది. దీపిక మృతదేహానికి శవపరీక్షల అనంతరం తగిన వివరతో తుది నివేదిక కోసం ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపుతున్నారు. ఈ నివేదిక వస్తే ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

leave a reply