చెడ్డి గ్యాంగ్..8 ఏళ్ళ తరువాత!

రెండు తెలుగు రాష్ట్రాల  ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన చెడ్డి గ్యాంగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. రాష్ట్రాలలో ఎన్నో చోరీలకు తెగబడ్డ  చెడ్డి గ్యాంగ్ పోలీసులకు తలనొప్పిగా మారారు. రాత్రిళ్ళు ఎవరు లేని ఇళ్లను వీళ్ళు టార్గెట్ గా చేసుకుంటారు. అవసరమైతే ఎటువంటి అఘాయిత్యం చెయ్యడానికైనా వీళ్ళు వెనుకాడరు. తెలుగు  ప్రజలను దోపిడీలతో హడలెత్తించిన మోస్ట్‌ వాంటెండ్‌ చెడ్డి గ్యాంగ్‌‌ను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ లోని  ముగ్గురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. వారి దగ్గర నుంచి 400 గ్రాముల వెండి, ఒక ఇనుప రాడ్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ గ్యాంగ్ 2010 నుంచి చోరీలకు పాల్పడుతోందని, రాత్రి సమయాల్లో 20 చోట్ల చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.ఈ గ్యాంగ్ ఎక్కువగా  విశాఖ, నెల్లూరు, తిరుపతి సహా తెలంగాణ, తమిళనాడులోనూ చోరీలకు తెగబడ్డారు. 

leave a reply