ఫైనల్లోకి…సైనా నెహ్వాల్‌!

ఇండోనేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ సూపర్‌-500 టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సైమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్‌ సైనా నెహ్వాల్‌ 18-21, 21-12, 21-18 పాయింట్ల  తేడాతో ఏడో ర్యాంకర్‌ హి బింగ్‌జియావో (చైనా)పై గెలుపొందింది. తొలి గేమ్‌ను చేజార్చుకున్న సైనా.. ఆపై తేరుకొని వరుసగా రెండు గేమ్‌లు సత్తా చాటి విజయంతో ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది.

మరో సెమీఫైనల్ లో గెలిచే క్రీడాకారిణితో సైనా తలపడనుది. హోరాహోరీగా సాగిన మ్యాచ్లో సైనానే పైచేయి సాధించారు.  తొలి గేమ్‌ను సైనా చేజార్చుకున్నప్పటికీ, రెండో గేమ్‌లో తన సత్తా చాటారు. ఏ దశలోనూ బింగ్‌జియావోకు ఎలాంటి అవకాశం ఇవ‍్వకుండా సైనా చుక్కలు చూపించారు. కాగా, మూడో గేమ్‌ ఆదిలో సైనా ఆధిక్యంలో నిలిచినప్పటికీ, బింగ్‌జియావో తిరిగి పుంజుకున్నారు. దాంతో మ్యాచ్‌ రసవత్తరంగామారింది. కాగా, చివర్లో ఒత్తిడిని అధిగమించిన సైనా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా మ్యాచ్‌ను తన వైపుకు తిప్పుకుంది. దీంతో ఇండోనేషియా మాస్టర్స్ ఫైనల్లోకి సైనా చేరింది.

leave a reply