మైదానంఏదైనా సరే టీమిండియా బౌలర్లు చెలరేగిపోతున్నారు.
మైదానం ఏదైనా సరే టీమిండియా బౌలర్లు చెలరేగిపోతున్నారు. ప్రత్యర్థి జట్టు ఎంత బలంగా ఉన్నఎదుర్కొంటున్నారు టీంఇండియా విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మన పేసర్లు రేసుగుర్రాల్లాంటి వారని టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నారు.ప్త్రాస్తుతబౌలర్లు ఎంతో అత్యుత్తమంగా రాణిస్తున్నారు.దక్షిణాఫ్రికా , ఇంగ్లాండ్ సిరీస్లలో బౌలర్ల ప్రదర్శన చాల గొప్పగా ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్సిరీస్ లో కూడా అదే ప్రదర్శన కొనసాగిస్తున్నారు. ఇలాగే వాళ్లకు తగిన సమయం ఇస్తూ రేసు గుర్రాలనుచూసుకున్నట్టు వారిని జాగ్రత్తగా చూసుకొంటూ వారి నుంచి మంచి ప్రతిభను పొందవచ్చన్నారు.
ఇప్పుడు ఆస్ట్రిలియాలొ కూడా మైదానాల గురించిపట్టించుకోకుండా అక్కడి పరిస్థితులకు అనుగుణంగా బౌలర్లను తీర్చిదిద్దుతున్నాం అని అరుణ్వెల్లడించారు. అడిలైడ్ మ్యాచ్లో అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్రా పోషించాడు. మ్యాచ్ను తిరిగి మాచేతుల్లోకి తీసుకొచ్చాడు. 90 కి పైగా ఓవర్లు వేసి 147 పరుగులే ఇవ్వడమంటే మాములు విషయం కాదు. ఒక ఎండ్నుంచి అశ్విన్ మరో ఎండ్ నుంచి పేసర్లు ఆస్ట్రిలియా బ్యాట్సమెన్స్ నునియంత్రించడంలో విజయం సాధించారు .గత పర్యటనలలో కొన్నితప్పులు చేసిన వాటిని వేగంగాఅధికమించి మంచి విజయాలను సాధిస్తున్నాం అని అరుణ్ పేర్కొన్నాడు.