మా వాడికి బుద్ది లేదు..!

వైసీపీ అధినేత జగన్‌పై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బుధవారం అనంతపురంలో జరిగిన ధర్మపోరాట దీక్ష సభలో ఆయన మాట్లాడుతూ, ‘మా వాడు జగన్‌కు ఎంత బుద్ధి ఉందో మీకు తెలుసు! బుద్ధీ లేదు పాడూ లేదు! ఒక్క అడుగు ముందుకేసి చూసి ఉంటే ఎప్పుడో ముఖ్యమంత్రి అయి ఉండేవాడు.. ఆ యోగం లేదు’ అని జోస్యం చెప్పారు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తే కనుక ప్రజలు తమ గుండెలపై చేయి వేసుకుని ‘హాయి’గా నిద్రపోవచ్చు అని అన్నారు. వేరే వ్యక్తి ఎవరైనా సీఎం అయితే బెంగళూరుకో, మరెక్కడికన్నానో పోయి పనులు చేసుకోవాల్సిందేనని సెటైర్లు విసిరారు. ప్రజల భవిష్యత్ కోసం మళ్లీ టీడీపీనే గెలిపించాలని, చంద్రబాబునే మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.

leave a reply