ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాడు..

అనంతపురం జిల్లా గార్లదిన్నె లో ఘోరం జరిగింది. ఇద్దరు పిల్లలు సహా తల్లి దారుణ హత్య. ఇంట్లో తల్లి, బిడ్డలను నరికి చంపిన దుండగులు. ఎంపీడీవో కార్యాలయం సమీపంలోని బోయ నల్లప్ప ఇంట్లో భార్యతో పాటు కూతురు, కుమారుడిని దుండగుడు హత్య చేశాడు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బోయ నల్లప్ప రైతుగా.. మృతులు మీనాక్షి, కీర్తి, నితీశ్‌గా గుర్తించారు. ఘటనకు ముందు ఓ వ్యక్తి సంచరించినట్లు స్థానికులు చెప్పారు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

leave a reply