అభినందనలు..

మంగళవారం దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌తో పాటు నాలుగు రాష్ట్రాలలో గెలిచిన నేతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ప్రస్తుతం ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తే దేశ వ్యాప్తంగా బీజేపీ బలం బలహీనపడిందని, జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలేందని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి మోసం చేయడమే తప్ప మేలు చేయడం తెలీదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి మోడి ఇక దేశానికేం మేలు చేస్తారని అన్నారు. బీజేపీకి ఏ పార్టీలైతే వ్యతిరేకంగా ఉంటాయో వాటితో తాము కలిసేందుకు సిద్ధంగా ఉన్నమన్నారు. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి ప్రజలు అండగా ఉన్నారని అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయ ఏర్పాటుకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దోహదం చేస్తాయని సీఎం తెలిపారు.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమిలో టీడీపీ భాగస్వామ్య పక్షంగా ఉంది. హైదరాబాద్‌, ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మహాకూటమి తరఫున కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు ప్రచారంలో పాల్గొని టీఆర్‌ఎస్‌ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

leave a reply