లాభాలతో ముగింపు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిసాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు ఒడిదుడుకులకు గురయినా.. చివరి రెండు గంటల్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో.. మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ వారంలో చూసుకుంటే స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 181 పాయింట్లు లాభపడి 35,695కి పెరిగింది. నిఫ్టీ 55 పాయింట్లు పుంజుకుని 10,727 వద్ద స్థిరపడింది.

leave a reply