సమంత అలా చేయనుందట..!

ఇటివ‌లి కాలంలో లేడి ఓరియెంటెడ్ చిత్రాలకి ఆదరణ మరింత పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో అనుష్క, నయనతార, త్రిష వంటి భామలు ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. రీసెంట్‌గా యూట‌ర్న్‌ చిత్రంతో అల‌రించిన స‌మంత.. మ‌రోసారి క‌థానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా చేయాల‌నుకుంటుంద‌ట‌. అయితే.. ఈ సినిమాకి నందినీరెడ్డి దర్శకత్వం చేయనుందట. ఇప్ప‌టికే నందిని.. సామ్ కోసం కథ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా రూపొందనుంది.

కొరియన్ భాషలో తెరకెక్కిన మిస్ గ్రానీని రీమేక్‌ చేయనున్నారని సమాచారం. ఇందులో స‌మంత 70 ఏళ్ళ వృద్ధురాలి పాత్ర‌లో క‌నిపించినుంద‌ట‌. అయితే తాను 20 యేళ్ల యువతిగా మారిపోతే ఎలా ఉంటుంది? తనకి 50 యేళ్ల కొడుకు ఉంటే ఎలా ఉంటుంది? అని క‌లలు కంటుంద‌ట‌. ఆ 50 ఏళ్ళ కొడుకు పాత్ర‌లో విల‌క్ష‌ణ న‌టుడు రావు ర‌మేష్ క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. స‌మంత‌, రావు ర‌మేష్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటాయ‌ని అంటున్నారు. తెలుగు రీమేక్‌కి `ఓ బేబి’ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. అయితే.. స‌మంత‌ ఇప్పటికే చైతూతో క‌లిసి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ ప్రేమ క‌థా చిత్రం చేస్తుంది. ఈ చిత్రానికి టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నారు.

leave a reply