సినీ నటుడు విశాల్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారట. ఈ విషయాన్ని ఆయన తండ్రి జీకే రెడ్డి కోలీవుడ్ మీడియా వర్గాలతో చెప్పినట్లు తెలుస్తోంది. హైదరాబాద్కు చెందిన అనీశా అనే ఓ వ్యాపారవేత్త కుమార్తెతో విశాల్ వివాహం జరగబోతున్నట్లు పేర్కొన్నారు. త్వరలో హైదరాబాద్లో నిశ్చితార్థ వేడుకను నిర్వహించనున్నారట.
కాగా.. సినీ నటి వరలక్ష్మి శరత్కుమార్ను విశాల్ పెళ్లిచేసుకోబోతున్నట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. ఇప్పటికీ వీరి గురించి వదంతులు వస్తూనే ఉన్నాయి. దీనిపై ఇటీవల వరలక్ష్మి ట్విటర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. విశాల్ తనకు కేవలం మంచి ఫ్రెండ్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇలాంటి వార్తలు ఎవరు సృష్టిస్తున్నారో తనకు తెలుసని హెచ్చరించారు.