విషాదం..

గుంటూరు నేషనల్‌హైవేపై బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యడ్లపాడు వద్ద ముందు వెళ్తున్న కంటైనర్‌ను వీళ్ల కారు బలంగా ఢీకొట్టింది. దీంతో.. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని 108 సిబ్బంది గుంటూరు కాటూరి మెడికల్‌ వైద్య కళాశాలకు తరలించారు. చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో డ్రైవర్‌తో పాటు బాలుడు, యువతి, మహిళ ఉన్నారు. సంఘటనపై యడ్లపాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి యర్రవరంలో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు చిత్తూరు ములకలచెరువు గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

leave a reply