బర్మింగ్హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్లకు ఈ సారి కఠినమైన డ్రా ఉండబోతుంది. మార్చి 6న ప్రారంభంకానున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సుంగ్ హ్యున్ (కొరియా)తో ఐదో సీడ్ సింధు ఎదుర్కోబోతుంది. అటు 8వ సీడ్ సైనా తొలి రౌండ్లో క్రిస్టీ గిల్మూర్ (స్కాట్లాండ్)తో తలపడనుంది. క్వార్టర్స్లో డిఫెండింగ్ ఛాంపియన్, ప్రపంచ నంబర్వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సైనా పోటీపడనుంది.
అటు పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో బ్రైస్ లెవెర్దెజ్ (ఫ్రాన్స్)తో ఏడో సీడ్ కిదాంబి శ్రీకాంత్ పోటీ పడనున్నాడు. అయితే తొలి రౌండ్లో శ్రీకాంత్ గెలిచినట్లైతే. రెండో రౌండ్లో శ్రీకాంత్కు జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) ఎదురుపడవచ్చు. ఆరంభ రౌండ్లు అధిగమిస్తే క్వార్టర్స్లో ప్రపంచ నంబర్వన్ కెంటొ మొమొట (జపాన్)తో శ్రీకాంత్ పోటీపడే అవకాశముంది. మిగతా తొలి రౌండ్ మ్యాచ్ల్లో సాయి ప్రణీత్తో ప్రణయ్, విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్)తో సమీర్వర్మ పోటీపడతారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో షువాన్యి- షియాన్యు (చైనా)తో సుమీత్రెడ్డి- మను అత్రి; మహిళల డబుల్స్ తొలి రౌండ్లో తనక- కొహరు (జపాన్)తో సిక్కిరెడ్డి- అశ్విని పొన్నప్ప తలపడనున్నారు.