ఏపీ హైకోర్టు సీజేగా..

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ నియమితులయ్యారు. 2019 జనవరి 1 నుంచి ప్రవీణ్‌ కుమార్‌ సీజేగా విధులు నిర్వహించనున్నారు. ఉమ్మడి హైకోర్టు విభజనపై బుధవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన కేంద్రం.. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌ను నియమిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీకి కేటాయించిన 16 మంది న్యాయమూర్తులలో ప్రవీణ్‌ కుమార్‌ అత్యంత సీనియర్‌ కావడంతో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఉమ్మడి హైకోర్టులో మొత్తం 27 మంది న్యాయమూర్తులు సేవలందిస్తుండగా 14 మందిని ఏపీకి కేటాయించారు.

leave a reply