సిగ్గుందా..? ఫినిష్‌ చేస్తా

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జంక్షన్‌ వద్ద ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాన్వాయ్‌ను అడ్డుకున్న బీజేపీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మోడీ ఏంచేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉండేందుకు బీజేపీ నేతలకు అర్హత లేదన్నారు. రాష్ట్రానికి మోడీ చేసిన అన్యాయాన్ని మీరు సమర్థిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రాన్ని, దేశాన్ని మోడీ ముంచేశారని విమర్శించారు. కాకినాడలో తలపెట్టిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

నన్ను డౌన్ డౌన్ అనడం కాదయ్యా. మీ అందరినీ జనాలు తరిమికొడతారు. లేనిపోని సమస్యలు పెట్టుకోవద్దు. మీరు ఫినిష్ అయిపోతారు. నిన్న కూడా తెలుగువాళ్ల మీద ఢిల్లీలో లాఠీచార్జ్ చేయించారు. ఈ గడ్డపై ఉంటూ, ఇక్కడి నీళ్లు తాగుతూ, ఇక్కడి గాలిని పీలుస్తున్నప్పుడు కమిట్ మెంట్ ఉండాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హద్దు దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

leave a reply