సీఎం సొంత జిల్లాలో వికృత చేష్టలు..!

ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు పుంగనూరులోని ఓ పాఠశాల ఆగడాలు బయటపడ్డాయి. హోంవర్క్‌ చేయలేదని, పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని విద్యార్థులను నగ్నంగా ఎండలో నిలబెట్టిన ఘటన ఆలస్యంగా జిల్లాలో వెలుగుచూసింది. పాఠశాలలో చదువుకుంటున్న 10 సంవత్సరాల వయసు కలిగిన ఆరుగురు విద్యార్థులను బుధవారం నగ్నంగా ఎండలో నిలుచోవాలని యాజమాన్యం శిక్షించింది. దీనిపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా.. యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాఠశాల కరస్పాండెంట్‌ నాగరాజ నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆ పాఠశాల గుర్తింపును అధికారులు రద్దు చేశారు. డీఈవో, ఆర్‌జేడీ ఆదేశాలతో పాఠశాల గుర్తింపును రద్దు చేసినట్లు ఎంఈవో లీలారాణి తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థుల నుంచి వివరాలు సేకరించామని, దీనిపై జిల్లా విద్యాశాఖాధికారికి నివేదికను అందజేస్తామని ఎంఈవో తెలిపారు.

leave a reply