బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్- పారుపల్లి కశ్యప్ల వివాహం ఎటువంటి హడావిడి లేకుండా హైద్రాబాద్ లోజరిగింది .ఈ వివాహ మహోత్సవంలో జరిగినా కశ్యప్ ఉపనయనం కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫొటోలను కశ్యప్ తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు. బంధువులు, శ్రేయోభిలాషుల రాకతో సైనా, కశ్యప్ల వివాహ మహోత్సవం సందడిగా మారింది. ఈ వివాహానికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ఒరియాన్ విలాస్ లో కుటుంబ సంభ్యుల మధ్యవీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ వేడుకకు ముఖ్య అథితులుగా గవర్నర్ నరసింహన్ దంపతులుు హాజరై వధూవరులను ఆశీర్వదించునట్లు సమాచారం. అయితే ఈనెల 16న నగరంలోని ఓ ప్రముఖ హోటల్లోజరగనున్న ఈ వివాహ విందుకు గవర్నర్ నరసింహన్తో పాటు కేటీఆర్, చిరంజీవి, కోచ్ పుల్లెల గోపీచంద్ పలువురు ప్రముఖులను ఇప్పటికే ఆహ్వానించినట్లు సమాచారం.
సైనా, కశ్యప్ల.. వివాహ మహోత్సవం!
Posted in: