టీమిండియా ప్రస్తుతం తిరుగులేని జట్టుగా ఆవిర్భవించింది. అయితే భారత క్రికెట్ జట్టులో హార్దిక్ పాండ్యా రెగ్యులర్ ఆల్ రౌండర్గా కొనసాగుతున్నాడు. ఇప్పటికే తానేంటో హార్దిక్ నిరూపించుకున్నాడు. తాజాగా న్యూజిలాండ్ సిరీస్ లో తెరపైకి వచ్చిన మరొక ఆల్ రౌండర్ విజయ్ శంకర్ తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్తో సిరీస్లో విజయ్ శంకర్ భారీ షాట్లతో విరుచుకుపడి. దీంతో ఆల్ రౌండర్ రేసులోకి వచ్చేశాడు. దీనిపై తాజాగా మాట్లాడిన విజయ్ శంకర్ తనకు హార్దిక్ పాండ్యాతో స్నేహ పూర్వక పోటీ మాత్రమే ఉందన్నాడు. హార్దిక్తో నాకు పోటీ ఉన్నట్లే కనపడుతున్న కానీ మా మధ్య స్నేహ పూర్వక పోటీ మాత్రమే ఉందని తెలిపాడు.
న్యూజిలాండ్తో సిరీస్లో మేమిద్దరం స్నేహపూర్వకంగా కలిసి ఆడామని, ఆ క్రమంలోనే చాలా విషయాలు చర్చించుకున్నాం. వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో ఎలా బౌలింగ్ చేయాలనే దానిపై హార్దిక్తో కలిసి చాలా విషయాల్ని షేర్ చేసుకున్నా. లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్తో పాటు ప్రభావం చూపే ఆటగాళ్ల గురించి తరచు మాట్లాడుకున్నాం. దాంతో మా మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. బయట నుంచి చూస్తే మా ఇద్దరి మధ్య పోటీ కనపడుతుంది. మేము మంచి స్నేహితులమని విజయ్ శంకర్ తెలిపాడు.