అజీర్ణ మాత్రలతో… జాగ్రత్త!

మనం తీసుకునే ఆహారంలో మసాలాలు ఎక్కువగా ఉండటం, సమయానికి సరిగా తినకపోవడం వల్ల కొన్ని అజీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అయితే అజీర్ణ సమస్యతో బాధపడేవారు తరచూ ఎసిడిటీ మాత్రలు తీసుకోవడం చేస్తుంటారు. ఈ మాత్రలు తీసుకోవడం వలన అజీర్తిసమస్య, కడుపులోమంట, గ్యాస్‌ వంటి సమస్యలు తగ్గుముఖం పట్టడం ఎలాఉన్నా,  దీర్ఘకాలంలో కిడ్నీలమీద తీవ్రప్రభావాన్ని చూపుతాయని పరిశోధకులు తెలియచేసారు.

ఎసిడిటీ మాత్రలు వాడుతున్న కొంతమందిఫై పరిశోధనలు జరిపి ఈ విషయం వెల్లడించారు. వీరిలో ఎసిడిటి సమస్య తగ్గుముఖం పట్టకపోగా, వీరి కిడ్నీల ఆరోగ్యం పాడవుతున్నట్లు పరిశోధకులు గమనించారు. దీని వలన మృత్యువు బారిన పడే అవకాశాలు 50 శాతం పెరుగుతాయని వారు చెబుతున్నారు. వైద్యుల సూచించిన మేరకు ఈ మందులు వాడుతున్న దుష్ర్పభావాలు మాత్రం తప్పవని వారు తెలిపారు. ఎసిడిటీ, అజీర్తి తదితర సమస్యల నుంచి తప్పించుకోవడానికి కృత్రిమ పద్దతుల కన్నా సహజపద్ధతులను అనుకరించడం మంచిదని వారు పేర్కొన్నారు.

leave a reply