అద్భుతం.. శ్రీవారి వద్ద గరుక్మంతుడు..!

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వింత చోటు చేసుకుంది. ధనుర్మాస ఉత్సవాలు పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సమయంలో ఆలయ గోపురం పైకి  గరుడ పక్షి రావడంతో భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంకటేశ్వర స్వామి వారి వాహనమైన గరుడ పక్షి సాక్షాత్తు స్వామి వారి విగ్రహం వద్దకు వచ్చి ఆయన పాదాల చెంత నిలబడి అలానే ఉండి పోయింది. విషయం తెలుసుకున్న భక్తులు ఈ విచిత్రన్ని చూసేందుకు భారీగా తరలివచ్చారు. గరుడ పక్షిని చూసి, ఇది స్వామి వారి లీలా అనుకోని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

leave a reply