చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర కడుపు నొప్పి కారణంగా గురువారం ఆస్పత్రిలోచేరారు. కంచన్బాగ్లోని ఒవైసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (MIM)ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు భావిస్తున్నారు. ఆలస్యంగా ఈవిషయం వెలుగులోకి వచ్చింది. కంచన్బాగ్లోని ఒవైసి ఆస్పత్రి మొదటి అంతస్తులోప్రత్యేక గదిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. గురువారం రాత్రి ఓ విందుకు హాజరైనసమయంలో అక్బరుద్దీన్కు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో ఆయన ఆస్పత్రిలోచేరారు. కుటుంబ సభ్యులు, బంధువులు,సోదరుడు అసదుద్దీన్ఓవైసీలు ఆసుపత్రికి చేరుకొని ఆయనను పరామర్శించి వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలిపేందుకు ఆసుపత్రి వర్గాలు నిరాకరించాయి. కుటుంబ సభ్యుల మినహా మిగతా ఎవరినీఆసుపత్రి లోపలికి అనుమతించడంలేదు. అయితే తాను కొన్ని రోజులుగాతీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాననీ.. కిడ్నీల సమస్యతోభాదపడుతున్న సంగతి ఇంతకుముందే చెప్పారు. బహుశా తనకు ఇవేచివరి ఎన్నికలు అని చెప్పడం కూడా జరిగింది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ..అక్బరుద్దీన్ ఒవైసీ!
Posted in: