ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీ పర్యటన..

భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తివెంక‌య్య‌నాయుడు నూతన సంవత్సరం జనవరి 4 నుంచి 6వరకు ఆంధ్రప్రదేశ్‌లోపర్యటించనున్నారని ఏపీ ప్రభుత్వ ప్రోటోకాల్ అడిషనల్ సెక్రటరీ ఎం.అశోక్‌బాబు ఒకప్రకటనలో తెలిపారు. జవనరి 4న సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలోఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖ చేరుకోనున్నారు. 5న ఉదయం గం.9.50 నిమిషాలకుకాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.అదే రోజు మధ్యాహ్నానికి విజయవాడలోని స్వర్ణభారతి ట్రస్ట్‌కు చేరుకుంటారు. 5న సాయంత్రం గం.4లకు లయోలా కాలేజీ శతవసంతాల వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. 6నఉదయం 9 గంటలకు గన్నవరం సమీపంలోని స్వర్ణభారతి ట్రస్ట్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మెడికల్ క్యాంపును ప్రారంభించనున్నారు. 6న సాయంత్రం తిరిగి ఢిల్లీ చేరుకుంటారని అశోక్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

leave a reply