మళ్లీ టీడీపీనే.. రావాలి..

ఏపీలో వచ్చే ఎన్నికలకు అభ్యర్థులను ముందే ప్రకటిస్తానంటూ ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం వీడియోకాన్ఫరెన్స్‌లో తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పార్టీ సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు సూచించారు.

కాగా.. మళ్లీ టీడీపీనే రావాలి.. అనే నినాదం ఏపీ అంతటా మార్మోగాలని, లేకుంటే అభివృద్ధి ఆగిపోతుందని చంద్రబాబు తెలిపారు. మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. మన గెలుపు ఏకపక్షం కావాలని మంత్రులకు, నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

అలాగే.. ఎక్కడా ఎలాంటి విభేదాలు లేకుండా.. బేధభావాలు చూపకుండా పనిచేసుకుంటూ పోవాలని సీఎం సూచనచేశారు. అన్ని అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ భారీ ఆధిక్యత కనబరచాలని చెప్పారు. టీడీపీ లేకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని ఎక్కడ ప్రాజెక్టులు అక్కడ ఆగిపోతాయని తెలిపారు. ఎన్ని తుఫానులు వచ్చినా ఎదురు నిలిచి నిరాశ్రయులకు చేయూతనందించామన్నారు. నాపై ఎలాంటి ఆరోపణలు చేసినా.. మాకు మోసం చేసినా.. చివరకు గెలిచేది మనమే అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే.. నియోజకవర్గంలోనూ సెమీ క్రిస్మస్ వేడుకగా జరపాలని, ఈ నెల 30న ‘జయహో బీసీ’ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

leave a reply