ఎప్పుడైనా, ఎలాంటి పరిస్థితులలో అయినా మీడియా ముందు ఎలాంటి క్లిష్ట ప్రశ్నలకైనా తడబడకుండా సమాధానాలిచ్చే ధోనీ! ఈసారి మాత్రం చాహల్ ఇంటర్వ్యూ అడిగితే పేవేలిన్ వైపు పరుగు పెట్టాడు. న్యూజిలాండ్తో ఐదో వన్డే విజయం అనంతరం బహుమతి ప్రదానోత్సవం తర్వాత ఆటగాళ్లందరూ ఉత్సహంగా మాట్టాడుతున్న సమయంలో మైదానంలో టీమిండియా యువ స్పిన్నర్ చాహల్ మొదలుపెట్టిన తన ‘చాహల్ టీవీ’తో ముచ్చటించాలని ధోనీ ముందు మైక్ పెట్టాడు. ఇందుకు ధోనీ నిరాకరించగా, అయినా మాట్లాడాల్సిందేనంటూ చాహల్ వెంటపడడంతో… ఇక ధోని పరుగు గురించి చెప్పేదేముంది అక్కడి నుంచి చాహల్ కి దొరకకుండా పరుగులు పెడుతూ డ్రెస్సింగ్ రూమ్పైపు వెళ్లిపోయాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఇదంతా సరదాగా చేసినట్లు తెలుస్తుంది.
పరుగు పెట్టిన… ధోని!
Posted in: