కడప:చాలా సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈనెల 27న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారని ఆంధ్ర రాష్ట్ర గనులు, భూగర్భశాఖల కార్యదర్శి, ఏపీఎండీసీ చైర్మన్ బి.శ్రీధర్ తెలిపారు. ఈ పరిశ్రమ కోసం ముందుగా కడప జిల్లా మైలవరం మండలం ఎం.కంబాలదిన్నెలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసే స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా చైర్మన్ గారు మాట్లాడుతూ ఎం.కంబాలదిన్నెలో 3140 ఎకరాలను ఉక్కుపరిశ్రమకు కలెక్టర్ గారు కేటాయించినట్లు వివరించారు. వీలైనంత త్వరగా భూమి పూజకు అవసరమైన పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ గారికి తెలియజేసారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు జరిగితే అక్కడి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో ఏపీఎండీసీ వైస్ చైర్మన్, ఎండీ వెంకయ్యచౌదరి తదితరులు పాల్గొన్నారు.
కడపలో ఉక్కు.. పరిశ్రమ!
Posted in: